Thursday, December 30, 2010
తెలంగాణ ఎలా వస్తుందో చూస్తా
అననగనగా ఓ బాతు… ఆ బాతు రోజు బంగారు గుడ్లు పెడుతుంది. అయితే బాతును పెంచే ఆసామికి అత్యాశ పుట్టింది. బాతు కడుపులో ఇంకా చాలా గుడ్లు ఉంటాయని భావించి ఆ బాతును కోసేశాడు. చివరికి అతడి ఆశ అడియాసగానే మారిపోయింది. ఈ కథ.. మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం.ఈ కథను కేసీఆర్ కూడా బాగానే ఒంటబట్టించుకున్నాడు.ప్రత్యేక తెలంగాణ అంశమనే బంగారు బాతును ఎప్పుడు సజీవంగా ఉంచి.. దాని నుంచి లాభం పొందాలే కానీ…తెలంగాణను తెచ్చుకుని ఆ బాతును చంపేస్తే.. తనకు బంగారు గుడ్లు రావనేది కేసీఆర్ కు బాగా తెలుసు.అందుకే పైకి మాత్రం తెలంగాణ ఎలా ఇవ్వరో చూస్తానంటారు..లోనికి మాత్రం..తెలంగాణ ఎలా వస్తుందో చూస్తా..అనే ఫీలింగ్ లో ఉంటారు. ఈ వార్త కొంత మంది తెలంగాణ వాదులకి..కేసీఆర్ అభిమానులకు కడుపుమండేలా చేయవచ్చు.కానీ కేసీఆర్ వ్యక్తిత్వాన్ని అతని ప్రస్థానాన్ని దగ్గరగా గమనించిన వారెవరికైనా కేసీఆర్ పైన అనుమానాలు మరింత బలపడేలా చేస్తాయి..కేసీఆర్ తరచూ మాటలు మార్చడం.. పార్టీలతో స్నేహాలు మార్చడం ఇవ్వన్నీ కేసీఆర్ అసలు స్వరూపాన్ని బయట పెట్టేవే..ఇప్పుడు కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేసినట్టే కనిపిస్తుంది.తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలే చేశారు. జనవరిలో మధ్యంతర ఎన్నికల ఖాయమని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు.తెలంగాణలో మనం..ఆంధ్రాలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పుకొచ్చారు.శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ లో ఏముందో తెలుసుకోకముందే కనీసం కేంద్రం తెలంగాణపై ప్రకటన చేయకముందే కేసీఆర్ ఇలా మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి.? జనమంతా తెలంగాణ ఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment