స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించింది ఎక్కువగా రెడ్లే..కానీ రెడ్డి రాజ్యంలో రెడ్లకు ఎంత న్యాయం జరుగుతుందనేదే ఇప్పుడు ప్రశ్న.రెడ్డి రాజ్యంలో రెడ్లకు న్యాయం జరుగుతుంది.అది ఎవరికి అంటే భూస్వాములైన రెడ్లకు..బడా రెడ్లకు మాత్రమే న్యాయం జరుగుతోంది. వారే పదవులను పొందుతున్నారు. అధికారానికి దగ్గరవుతున్నారు. అధికారానికి దగ్గర ఉన్న రెడ్లతో పనులు చేయించుకుంటూ వారే కోట్లకు పడగలెత్తుతున్నారు.ఇంకా కడప జిల్లాలో పేదరికంలో మగ్గుతున్న రెడ్లకు కొదవేలేదు. వాళ్లకేం రెడ్డిగారు
అనే మాటే కానీ ఇప్పటికీ భాగ్యనగరానికి వచ్చే కూలీల్లో రెడ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ఇది నిజం..నూటికి నూరుపాళ్లు నిజం. కనీసం ఎస్సీలుగా పుట్టిన రిజర్వేషన్ ఉండేది అది బాధపడే రెడ్లు కూడా చాలా మందే ఉన్నారు. కానీ వారి ఆవేదన పాలకులుగా ఉన్న ఏ రెడ్డికి పట్టలేదు.పేద రెడ్లకు ఇంకా చదవండి
రెడ్లకు రాజ్యాధికారం కొత్త కాదు. 650 ఏళ్ళ క్రితమే పెదకోమటివేమారెడ్డి, అనపోతారెడ్డి,, కుమారగిరిరెడ్డి లాంటివారు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. స్వాతంత్ర్యం రాకముందే రెడ్లు మద్రాసురాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈ చారిత్రిక నేపథ్యం అంతా కలిపి రెడ్లని ఆర్థికంగా కూడా బాగుచేయాలని ఆశించడం వృథా. బ్రాహ్మణులు రెడ్లకంటే కొన్నివేల సంవత్సరాల పూర్వమే అగ్రకులంగా గౌరవించబడుతూ వస్తున్నారు. కానీ వారికి ఈనాటికీ ఆర్థికహోదా లేదు. రాజకీయహోదా కూడా లేదు. అలా పోల్చుకున్నప్పుడు రెడ్ల పరిస్థితి గుడ్డిలో మెల్లలా కాస్త మేలు.
ReplyDeleteరెడ్ల అసలు సమస్య జనాభాపరంగా మరీ పెద్దకులం కావడం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డెబ్భైలక్షలమంది రెడ్లని ఉన్నపళాన బాగుచేయాలంటే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం ? బాగుచేయకపోయినా రెడ్లు ఒక రెడ్డికి వోటేస్తారు, తమను బాగుచేస్తే తప్ప ఇతరులు ఒక రెడ్డికి వోటెయ్యరు. కాబట్టి ఒక రెడ్డి నాయకుడు ఆటోమ్యాటిగ్గా ఎవరిని బాగుచేయడానికి నిశ్చయించుకుంటాడో ఆలోచించండి.