Sunday, December 26, 2010
కూచిపూడి గిన్నీస్ రికార్డు
తెలుగు కూచిపూడికి అరుదైన గౌరవం దక్కింది.హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డుని సాధించింది.చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే విధంగా చేసిన ఈ నృత్యానికి ప్రశంసల వర్షం కురిసింది.ఈ నృత్యకార్యక్రమంలో ఏకకాలంలో 2800 మంది నృత్యకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన కూచిపూడి నృత్యకళాకారులు పాల్గొన్నారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్, గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు థిల్లానా నృత్యాన్ని ప్రదర్శించారు. థిల్లానా నృత్య రూపకర్త వెంపటి చిన సత్యంతోపాటు పలువురు నృత్యకళాకారులకు రాష్టప్రతి సన్మానం చేశారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి, కేంద్రమంత్రి పురంధేశ్వరి, టూరిజం శాఖ మంత్రి వట్టి వసంత కుమార్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్యెల్యేలు హాజరయ్యారు.చెవిలో పువ్వులు పెడుతున్న కాంగ్రెస్ నేతలు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment