కాంగ్రెస్ అంటేనే రెడ్డీస్ .. రెడ్డీస్ అంటేనే కాంగ్రెస్ అనేది ఎప్పటి నుంచో రాష్ట్రంలో బలపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు సీఎంలుగా రెడ్డిలను మాత్రమే నియమిస్తూ వచ్చింది.ఒకరిద్దరు తప్పించి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన వారంతా రెడ్డిలే కావటం.. ఆ పార్టీ రెడ్డిలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో చెప్పకనే చెప్పింది.అదే రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోనే ఢీకొట్టారు. సై అంటే సై అన్నారు. సవాలు చేసి.. నువ్వెంత అంటూ ఢీల్లీ పైకే దండెత్తారు ఈ క్రమంలో మొట్టమొదట కాసు బ్రహ్మనంద రెడ్డి గురించి చెప్పుకోవాలి.
ఇందిరాగాంధీ అప్పటికే దేశ వ్యాప్తంగా ఎంతో పేరున్న లీడర్ గాంధీ కుటుంబం.. కానీ కాసు బ్రహ్మనంద రెడ్డి దెబ్బకు మాత్రం ఆమె విలవిలలాడింది. అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసు బ్రహ్మనంద రెడ్డి ఏకంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒక తెలుగు వాడు ఢీల్లీ ని షేక్ చేసిన పరిణామం అది. ఇందిరా గాంధీ గత్యంతరం లేక పార్టీ ఇందిరా కాంగ్రెస్ పార్టీని స్థాపించుకుంది.. చివరకు ఆమెకు పార్టీ గుర్తు కూడా రాలేదు. ఏన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెడ్డి కాంగ్రెస్ గా మారిపోయింది. జనంలో కూడా దానికి రెడ్డి కాంగ్రెస్ అనే పేరు.. అలా కాంగ్రెస్ పార్టీని రెడ్డిలు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడాఇంకా చదవండి
No comments:
Post a Comment