Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Tuesday, December 28, 2010

తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ ల దీక్ష విరమణ


విద్యార్ధులపై అన్ని కేసులు ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంగళవారం మంత్రుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యియి. కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు తెలంగాణలోగాని, అటు సీమాంధ్రాలోగాని విద్యార్ధులపై మొత్తం 8047మందిపై కేసులు 1,667 నమోదయ్యాయని హోంమంత్రి పేర్కొన్నారు. అయితే అన్ని కేసులూ ఒకేసారి ఎత్తివేయడం జరగదని, తీవ్రత ఉన్న కేసులను న్యాయపరంగా తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కాపీని దీక్షా శిబిరం వద్ద ఎంపీలకు అందజేసి, దీక్ష విరమించాలని హంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో తమ లక్ష్యం నెరవేరినందున దీక్ష విరమిస్తున్నట్లు కేశవ రావు ప్రకటించారు.

No comments:

Post a Comment


Namitha Latest pics