Wednesday, December 1, 2010
కాపుల తిరుగుబాటు
కాపులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మంత్రి పదవుల్లో మూడు కాపులిచ్చి.. పదమూడు రెడ్లకు ఇవ్వడంపై వారు కన్నెర్ర చేస్తున్నారు.కనీసం ఇచ్చిన మూడు మంత్రిత్వ పదవులు కూడా అప్రాధాన్య శాఖలు కేటాయించి చేతులు దులుపుకున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు. నిన్న మొన్నటి వరకు బొత్స డిప్యూటీ సీఎం అనే వార్తలు కూడా వచ్చాయి. పీసీసీ రేసులో కూడా బొత్సముందున్నారు.కానీ బొత్సకు అంతగా ప్రాధాన్యం లేని రవణా శాఖ కట్టబెట్టడంతో ఇప్పుడు బొత్స మొత్తం కాపు ఎమ్మేల్యేలను కూడగడుతున్నారు. ఇప్పటికే వట్టి వసంత్ కుమార్ తనకు సరైన శాఖ ఇవ్వలేదంటూ రాజీనామా చేశారు. ఇక ఇదే బాటలో మున్నూరు కాపుకు చెందిన పొన్నాల లక్ష్మయ్య,దానం నాగేందర్ లు నడిచే అవకాశం ఉంది. కన్నా లక్ష్మినారాయణ కూడా తనకు సరైన శాఖ దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి వట్టి వసంత్ కుమార్ ఇంట్లో దాదాపు పదిమంది మంత్రులు సమావేశమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి తన సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇవ్వడంతో పాటు.. కీలక శాఖలుఇంకా చదవండి..
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment