Friday, December 10, 2010
జేపీ ది ఫర్ఫెక్ట్ లీడర్
నిజమైన సమస్యలపై నిష్పాక్షికంగా మాట్లాడే ఒకే ఒక్క ప్రజా నాయకుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ.ఈ విషయాన్ని ఆయన మరోసారి నిరూపించారు.నేడుఅసెంబ్లీలో ప్రధానంగా విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేతపైనే చర్చ సాగింది. అయితే ఈ చర్చలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. కానీ లోక్సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ మాత్రం... చేసిన నేరమేమిటో విచారించకుండా మూకుమ్మడిగా కేసులను ఎలా ఎత్తివేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా ఆస్తులైన బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించి భారీ నష్టానికి కారకులైన వారిని ఎలాంటి విచారణ జరపకుండా... కనీసం మందలించకుండా వదిలిస్తే... ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళుతుంది..? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జేపీ వ్యాఖ్యలకు ప్రాంతీయవాదం రంగును పులిమాయి కొన్ని దుష్టశక్తులు. అసెంబ్లీ లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే హైదరాబాద్లో తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నాయి. అయితే ఏ శక్తులు ఎన్ని కుయుక్తులు చేసినా నిజాయితీ ఆయుధంగా చేసుకున్న నాయకుడి వెనుక తెలియకుండానే మహాశక్తులు నడుస్తాయి... మద్దతు పలుకుతాయి... ముందుకు నడిపిస్తాయి. ఏదేమైనా ఇవాళ్టి సమావేశాల్లో "జేపీ... ది పర్ఫెక్ట్ లీడర్" అనిపించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)

he did very nice job..........
ReplyDeleteyes he is the only perfect LEADER in assembly
ReplyDeletegives me goosebumps to see such leader speaking. he reminds me of some highly inspirational freedom fighters
ReplyDelete