Monday, December 6, 2010
సీఎంగారూ దాచేస్తే..దాగదులే..
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిమనస్సులో ఎంత దాచిపెడదామనుకున్నా కూడా.. దాగటం లేదు. అది ఎలాగోలా బయటికి వస్తూనే ఉంది. ఉద్యమాల వల్ల ఆరువేల కోట్ల రూపాయల నష్టపోయమని..కొత్త ప్రాజెక్ట్లు రావడం లేదని కిరణ్ చెప్పుకొచ్చారు.తెలంగాణ ఇవ్వడం నా చేతుల్లో లేదంటూనే..సీమ కంటే తెలంగాణ బాగానే డెవలప్ అయిందన్నట్టు కెప్టెన్ కిరణ్ మాట్లాడారు.ఇక మా దగ్గర ఎకరం రెండు లక్షలు.. మీ దగ్గర ఎకరం రెండు కోట్లు అంటూ.. ఇక్కడ ఎంత డెవలప్ అయిందో చూడండనే కోణంలో మాట్లాడారు. దీనిపైనే తెలంగాణ కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఇక్కడ భూములు ఎవరు కొనుకున్నారో రికార్డులు బయటకు తీయాలన్నారు.కొన్ని ప్రయివేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిన భూముల లెక్కలు కూడా బయటకు తీయాలని దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ప్రాణహిత పుష్కరాలకు వెళ్లిన సీఎం అక్కడ కూడా..ఆంధ్రా, తెలంగాణ అని కాదు.. మనందరం కలిసి కట్టుగా ఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

modalaindi musalam
ReplyDelete