పులివెందుల సభలో జగన్ ఓ మాట అన్నారు. .దేశం యావత్తు పులివెందుల ఉప ఎన్నికల గురించి ఎదురుచూస్తుంది.. ఇక్కడి పరిణామాలే గమనిస్తుంది అని.. ఈ మాటలకు తగ్గట్టుగా జగన్ మీడియా తన బాస్ కు అండదండలు అందిస్తోంది. ఆదివారం ఎన్టీవీలో జాతీయ మీడియా జగన్ వైపు చూస్తుందని..ఓ కథనాన్ని ప్రసారం చేసింది.జగన్ కు జైజేలు పలికేలా ఆ కథనం నడిచింది.జగన్ కు ఇప్పటికే సాక్షి అధికార ఛానల్ కాగా అవి కాకుండా ఎన్టీవీ,టీవీ5,ఐన్యూస్ లు అనధికార ఛానళ్లు.ఇవి కాకుండా హెచ్ ఎమ్ టీవీ,జీ 24 గంటలు కూడా జగన్ కు వ్యతిరేకంగా లేవు.ఎంతో కొంత పాజిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఎంతో కొంత వీటి యజమాన్యాలతో జగన్ కు ఉన్న సత్సంబంధాలే కారణం.అందుకే ఇప్పుడు జగన్ జిల్లా టూర్ లను ఓదార్పు యాత్రలను ఇవి మాగ్జిమమ్ కవర్ చేస్తుంటాయి.సాక్షి ఛానల్ లో నేరుగా చెప్పలేని అంశాలు కొన్ని ఎన్టీవీ, టీవీ 5, ఐ న్యూస్ ల ద్వారా చెప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇక జగన్ కు వ్యతిరేకంగా ఉన్నఛానళ్లో ఇంకాచదవండి
No comments:
Post a Comment