Wednesday, December 1, 2010
జగన్ రాజీనామా ఎఫెక్ట్..
జగన్ రాజీనామా ఎఫెక్ట్ బాగానే పనిచేస్తుంది. జగన్ మంత్రి వర్గం ఏర్పాటుకు ముందే రాజీనామ చేయడంతో దాని ప్రభావం మంత్రివర్గంపైపడింది. జగన్ వర్గానికి చెందిన చాలా మందికి పదవులు దక్కాయి. అయితే వీరంతా ఒక కాలు అధిష్టానం..మరో కాలు జగన్ వైపు వేసి ఉన్నవారు కావడం విశేషం.. జగన్ వీర విధేయులకు మాత్రం పదవులు దక్కలేదు. కిరణ్ కుమార్ తన సొంత టీమ్ ను తయారు చేసుకుందామని ఎన్నో నెలలుగా చేసిన కసరత్తు వేస్టయింది. జగన్ రాజీనామతో కిరణ్ తన సొంత జాబితాను జేబులోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. కిరణ్ సొంతంగా యంగ్ టీమ్ ను ఏర్పాటు చేసుకుందామని భావించారు . మారిన రాజకీయ పరిణామల్లో ప్రభుత్వాన్ని కాపాడుకోవటమే ప్రధానంగా మంత్రి పదవుల కేటాయింపు చేశారు. జగన్ వర్గం వైపు వెళ్లకూడదని భావించి..అదే జగన్ వర్గానికి పదవులు కేటాయించారు. మహాబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణకు మంత్రి పదవి ఇవ్వకూడదనుకున్నారు. కానీ ఈమె మంత్రి పదవి రాకపోతే.. జగన్ వైపు వెళ్లే అవకాశముందని భావించి..ఆమెకు మంత్రి పదవి ఇచ్చేశారు. రఘువీరా రెడ్డి పక్కాగా జగన్ మనిషి కానీ.. రఘువీరా కూడా ఎర్ర జెండా ఎగురవేస్తాడనే భయంతో మంత్రి పదవి కేటాయించారు.ఇక అదే జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి జగన్ వైపు వెళ్లే అవకాశం లేదు కాబట్టి.. జేసీకి మంత్రి పదవి ఇవ్వలేదు. జగన్ వైపు వెళతారనే ఏ మాత్రం అనుమానంఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment