జనం తన గురించి చర్చించుకోనేలా చేయటంలో జగన్ ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు సగానికి పైగా మీడియా జగన్ చేతిలో ఉంది. సాక్షి, ఎన్టీవీ, టీవీ5,ఐన్యూస్ లు జగన్ కు అండగా నిలుస్తున్నాయి. వీటికి జగన్ నుంచి కొంత ఆర్థిక మద్దతు లభిస్తుందని సమాచారం.. ఇక హెఎమ్ టీవీ..జగన్ కు వ్యతిరేకంగా పని చేయడం లేదు. అది కాకుండా.. కపిల్ చిట్ ఫండ్స్ కు చెందిన ఈ ఛానల్ కు..జగన్ కు మంచి సంబంధాలు కూడా ఉన్నట్టు తెలిసింది..ఇక జీ 24 గంటల్లో ..సీఈఓ తో పాటు.. కీలక ఉద్యోగులు జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.అది కూడా.. జగన్ కు పరోక్షంగా జై కొడుతోంది.. ఇక జగన్ కు వ్యతిరేకంగా.. ఈటీవీ2,ఎబీఎన్, మహాటీవీ, స్టూడియోఎన్ ఛానళ్లు ఉన్నాయి. వీటి ప్రభావం అంతంత మాత్రమే అని జగన్ వర్గం అంచనాకు వచ్చింది. చివరికి ఈ ఛానళ్లలో వచ్చే నెగిటివ్ ప్రచారం కూడా..తమకు కలిసివస్తుందని భావిస్తుంది.. సోనియా గాంధీని తిడుతూ.. సాక్షి ప్రసారం చేసిన కథనం..ఇప్పుడు ఆ టీవీలో కంటే.. మిగిలిన ఛానళ్లలో ఎక్కువగా టెలికాస్ట్ అయింది. అంటే దీని బట్టి..జగన్ ఎంతో చాకచాక్యంగా ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారనేది అర్థమవుతోంది. జగన్ ..జగన్...ఈ పేరు ప్రతి రోజు.. టీవీల్లో మారుమ్రోగుతూ ఉండాలి..ప్రస్తుతం జగన్ కోరుకుంటున్నది అదే.. సొంత బలంతో కొత్త పార్టీ పెట్టే వారికి ఇది చాలా చాలా అవసరం..
జగన్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి..? ఏయే జిల్లాల్లో ఎవరు జగన్ వైపు ఉన్నారు.. ప్రతి రోజు..ఎక్స్ క్లూజివ్ స్టోరీస్ తెలుగుశక్తిలో..
No comments:
Post a Comment