Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Monday, November 29, 2010

ఏదీ తెలుగోడి పౌరుషం..?


తెలుగు వాడి ఆత్మ గౌరవం దెబ్బ తింటోందా ? ఢీల్లీ వీధుల్లో  చలిలో వణికిపోతూ మన ఎమ్మేల్యేలు  మంత్రి పదవుల కోసం సోనియమ్మ గడప దగ్గర కాపలా కాయాల్సి వస్తుందా? అసలు తెలుగు రాని ,మన రాష్ట్రం గురించి తెలియని, కనీసం సొంతంగా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవని కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుని అయ్యా నాకో మంత్రి పదవి కావాలి అని తెలుగు వాడు అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది.ఒక్కొక్కరు శాలువాలు కప్పుకుని అర్థరాత్రి అయినా చలిలో వణికిపోతూ  కాంగ్రెస్ పెద్దల  గేట్ల దగ్గర కాపలా కాస్తుంటే..తెలుగు వాడి ఆత్మగౌరవం ఏం కావాలి ?
మనకు రోషం లేదా.. పౌరుషం లేదా..? మీసం తిప్పే మగాళ్లు ..పౌరుషం ఉన్న పొలిటికల్లీడర్లు,  ఇక్కడ పులులమని చెప్పుకునే వాళ్లు.. అక్కడ పిల్లుల్లా.. కాంగ్రెస్ పెద్దల చెప్పుల్లా ఎందుకు  మారిపోతున్నారు. మన రాష్ట్రం, మన పాలన మనం చేసుకోలేమా.? ముఖ్యమంత్రి అయిన వారు.. ముఖ్యమంత్రి కావాలనుకునేవారు.. అందరూ ఒక్కటే మాట ఆంధ్రప్రదేశ్ నుంచి 41 మంది ఎంపీలను పంపాలి. రాహుల్ ను ప్రధాన మంత్రిని చేయాలి. రాహుల్ కంటే మేధావులు ఎంతో మంది ఉన్నారు. మన్మోహన్ లాంటి మేధావి ఇప్పుడు ప్రధానిగా పనిచేస్తున్నాడు. అయినా కూడాఇంకా చదవండి

No comments:

Post a Comment


Namitha Latest pics