Wednesday, November 24, 2010
స్పీకర్లతో పెట్టుకుంటే అంతేనా…
స్పీకర్లు మాములు వాళ్లు కాదు.. అదను చూసి దెబ్బ కొడతారనే ఎపీ పొలిటికల్ హిస్టరీ చెబుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మంత్రి పదవి కోసం ఎన్నో సార్లు కిరణ్ కుమార్ రెడ్డి వేడుకున్నాడు.. వేడుకున్నాడు నీ కెందుకు ఈ సారి ఇస్తాలే అని వైఎస్ మొదటి సారి కాలాన్ని నెట్టుకొచ్చాడు.తనకు వైఎస్ మళ్లీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి..ప్రభుత్వ విప్ గా ప్రతిపక్షంపై తన మాటల పవర్ తో పెద్ద యుద్ధమే చేశాడు.ఆ తర్వాత రెండోసారి వైఎస్ సీఎం అయ్యాక.. కూడా కిరణ్ కు హ్యాండిచ్చాడు. ఈ సారి నీవే స్పీకర్ గా ఉండు..నీకెందుకు నేనున్నా.. అంటూ మంత్రి పదవి ఇవ్వకుండానే స్పీకర్ తో సరిపెట్టాడు. ఇక్కడ కిరణ్ కు చిర్రెత్తుకొచ్చింది. తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ మంత్రి పదవి కట్టబెట్టాడు. తనకు ఇవ్వాల్సిన పదవి శత్రువు కట్టబెడితే కిరణ్ కు కడుపులో బాగానే మండింది. కానీ ఎప్పుడు బయటపడలేదు. అసలు ఒకప్పుడు పెద్ది రెడ్డి కూడా వైఎస్ ను నానా బూతులు తిట్టిన వాడే. కానీ పెద్ది రెడ్డి కొడుకుతో జగన్ కున్న సంబంధాలే..పెద్దిరెడ్డికి మంత్రి పదవి వచ్చేలా చేశాయి. మొత్తానికి జగన్ కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా..ఇంకా చదవండి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment