మద్దెల చెరువు సూరిపై కాల్పులు
మద్దెల చెరువు సూరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సూరిని జూబ్లీహిల్స్ అపొలో ఆసుపత్రికి తరలించారు. సూరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 13లో సూరిపై దుండగులు అటాక్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఆయన తలకు బలమైన గాయాలైనట్లు సమాచారం. సూరి ప్రయాణిస్తున్న కార్పుపై కాల్పులు జరపడంతో వాహనం ప్రమాదానికి గురయినట్లు తెలుస్తోంది. కారులో సూరితో పాటు ఉన్న మరో ఇద్దరికి కూడా గాయాలైనట్లు వార్తలందుతున్నాయి. పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సూరి ఇటీవలే ఫ్యాక్షనిజానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.అయితే సూరిపై కాల్పులకు సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు కాల్పులు జరిగినట్లుగా వస్తున్న వార్తలను సూరి అనుచరులు కొందరు ఖండిస్తున్నారు. సూరి ప్రయాణిస్తు కారు ప్రమాదానికి గురవడం వల్ల ఆయన గాయపడ్డారని చెబుతున్నారు. కాగా... సూరి తన లాయర్ను కలిసి బయటికి వస్తుండగా కాల్పులు జరిగినట్లు కూడా సమాచారం..తెలంగాణ గోపీలు
మద్దెల చెరువు సూరి పై హత్యాయత్నము:ఇది తెలంగాణా ఉద్యమాన్ని ప్రక్కదారి పట్టించడానికి జరిగిన కుట్ర!
ReplyDeleteప్రతీ దానికి తెలంగాణా మీదనేనా జోకులు? అయినా అనంతపురం లొ నరుక్కుని చావక ఇక్కడికెందుకు దాపురిస్తార్రా నాయనా?
ReplyDelete