జగన్ పని అయిపోయినట్టేనా..?జగన్ ను ఇరికించేందుకు పకడ్భంధీ ప్రణాళికను కాంగ్రెస్ హైకమాండ్ రచించిందా..? ఢీల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రణబ్,అహ్మద్ పటేల్, సోనియా గాంధీలతో ఇదే విషయం చర్చించి వచ్చారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ కు చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందనిపిస్తుంది.జగన్ పార్టీ పెట్టే లోపే జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలని కూడా రెడీ అయింది.తోక జాడిస్తున్న ఎమ్మేల్యేలను కూడా దారిలోకి తెచ్చేలా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా ముందుగా ఆదాయపు పన్నుశాఖ జగన్ ఆస్తులపై ఆరాతీస్తుంది. మరో కొద్ది రోజులు ఇన్ కంట్యాక్స్ డిపార్టమెంట్ జగన్ చుట్టూ ఉచ్చు బిగించబోతుంది.మరో వైపు మంత్రి శంకరరావు సాక్షిలో పెట్టుబడులు ఎలా వచ్చాయి. వైఎస్ వల్ల లబ్ధిపొందిన వాళ్లు ఎలా సాక్షిలో పెట్టుబడులు పెట్టారనే దానిపై గతంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరంగాచెప్పారు.దీనినే హైకోర్టు సుమోటా స్వీకరించి..సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారికి నోటీసులు పంపింది.వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన మీడియా కంపెనీలో పెట్టుబడులపై హై కోర్టు సోమవారంనాడు మొత్తం 57 మందికి నోటీసులు జారీ చేసింది.జగన్ సహా ఏడుగురు అధికారులు, 51 మంది పెట్టుబడిదారులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.ఈ వ్యవహారంపై సి.బి.ఐ. విచారణ ఎందుకు ఆదేశించకూడదో ప్రశ్నిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.సజ్జల గ్రూపు, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టి.వి. తదితరులకు ఈ నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీలోగా సమాధానం ఇవ్వవలసి ఉంది. ఇదిలా ఉంటే మరో వైపు ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలుఇంకా చదవండి
No comments:
Post a Comment